Skip to main content

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కౌంటర్.. హైకోర్టు అసంతృప్తి....!


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలుచేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.



  • తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ ప్రారంభించింది.
  • ఆర్టీసీ కార్మికుల తరఫున తెలంగాణ జనసమితి నేత కోదండరాం, జేఏసీ నేతలు హాజరయ్యారు.
  • తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది
  • ఈ నెల 19వ తేదీ వరకు విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.


ఈ సందర్భంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్ దాఖలు చేశారు. సమ్మెపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. మరోవైపు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అంతేకాదు కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని కోర్టుకి తెలిపింది. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుని బస్ పాస్ హోల్డర్స్‌ను ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించింది. ఇప్పటికే అన్ని డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, మరోసారి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, ప్రభుత్వం దాఖలు చేసీన కౌంటర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నివేదిక అస్పష్టంగా ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల తరఫున తెలంగాణ జనసమితి నేత కోదండరాం, జేఏసీ నేతలు హాజరయ్యారు.

మరోవైపు, ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులతో బస్సులను నడిపిస్తున్నా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం నుంచి షెడ్యూల్‌ ప్రకారం బస్సులు నడవనున్నట్లు రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌‌కుమార్ ప్రకటించారు. కొన్నిచోట్ల టికెట్‌ ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రతి బస్సులోనూ ఛార్జీల పట్టికను ఏర్పాటు చేశారు.

టికెట్‌ ధరకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా తాత్కాలిక ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బస్‌ పాస్‌ను కూడా అనుమతించనున్నారు.
ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
పండగ ముగియడంతో ప్రజలు సొంతూళ్ల నుంచి రాజధానికి చేరుకుంటున్నారు.......

Comments

Popular posts from this blog

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు

సమ్మక్క , సారాలమ్మ జాతర ప్రారంభం సమ్మక్క , సారాలమ్మ విశేషాలు    *16 వ తేదీన సారలమ్మ , పగిడిద్దరాజు , గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు.*  *17 వ తేదీన సమ్మక్క తల్లి గద్దెపై కొలువు తీరుతుంది .* *18 వ తేదీన భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.*  *19 వ తేదీన దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.*  ☘సమ్మక్క మేడారం ఎలా వచ్చింది ?☘ ‘‘పుట్టు భయ్యక్క పేట పురమందు వెలసినా ఆ చందా పరుమయ్యా ఆ యింటి సమ్మక్క.’’ సమ్మక్క భయ్యక్కపేటలో పుట్టింది. ‘చందా’ అనే పేరు గల పరుమయ్య ఇంట్లో ఉండేది. ప్రస్తుతం గుడి బయ్యక్కపేటలో ఉంది. *‘బయ్యక్కపేటలో ఉండలేను. మేడారం పంపించమని’* కోరుతుంది. ‘చందా’ పరుమయ్య మేడారం గ్రామం వచ్చి (మేడారానికి బయ్యక్కపేట 10 కి.మీ దూరంలో ఉంటుంది.) అక్కడి గ్రామ తల్పతి (కులపెద్ద), వడ్డె (పూజారి), అర్థి బిడ్డతో (ఆక్షిశితులను) మాట్లాడి సమ్మక్క *‘బయ్యక్కపేటలో ఉండను’* అంది. కాబట్టి , మేడారం తీసుకెళ్తున్నానని 3 వ గోత్రికం ‘కొక్కెర’ అను ఇంటి పేరు గలవారిని , 5 వ గోత్రికం ‘సిద్ధబోయిన’ అనే ఇంటి పేరుగల వారిని వడ్డెలు ఒప్పించి మేడారంలో దించి పోతాడు. ఆనాటి నుండి ఇప్పటివరకూ వా...

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో ట్రైనీ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలివే NTPC Recruitment 2019-20 | దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ www.ntpccareer.net ఫాలో కావాలి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్-NTPC ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 స్కోర్ ఆధారంగా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. గేట్ 2020 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఎన్‌టీపీసీలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జనవరి 10న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్  NTPC careers ;&nbsp ఫాలో కావాలి. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన షార్ట్ నోటిఫికేషన్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి. NTPC Recruitment 20...

సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

*AISSEE 2022 : సైనిక్ స్కూల్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.... వివరాలు ఇలా* *దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) లలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది* *ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా ఆరోతరగతి, తొమ్మిదో తరగతులకు సైనిక్ స్కూల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.* *ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.* *దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27, 2021 నుంచి ప్రారంభమవుతుంది.*  *దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 26, 2021 వరకు అవకాశం ఉంది.* *ప్రవేశ పరీక్ష (Entrance Test) జనవరి 9, 2022న నిర్వహిస్తారు.* *పరీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.* *ముఖ్య సమాచారం* *దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021* *దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021* *సవరణలకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుంచి నవంబర్ 2, 2021* *పరీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4...