Skip to main content

Posts

Showing posts from May, 2020

Featured post

కళ్లుచెదిరే ఆఫర్‌.. కనీవినీ ఎరుగని రాయితీ...... upto 75%

ఎంఎస్‌ఎంఇలతో సహా వ్యాపారాల కోసం 3 లక్షల కోట్ల రూపాయల

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారత ఆర్ధిక వ్యవస్థ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి వ్యాపారాలకు, ముఖ్యంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సంబంధించిన ఉపశమనం మరియు రుణ మద్దతు కోసం చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు.   ఎమ్.ఎస్.ఎం.ఈ. లతో సహా వ్యాపారాలకు 3 లక్షల కోట్ల రూపాయల అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ సదుపాయం.  ఒత్తిడికి గురైన ఎమ్.ఎస్.ఎమ్.ఈ.ల కోసం 20,000 కోట్ల రూపాయల సబార్డినేట్ ఋణం. ఎమ్.ఎస్.ఎమ్.ఈ. నిధి ద్వారా 50,000 కోట్ల రూపాయల ఈక్విటీ ఇన్ఫ్యూజన్.   ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కి కొత్త నిర్వచనం మరియు ఎమ్.ఎస్.ఎమ్.ఈ. కోసం ఇతర చర్యలు.  200 కోట్ల రూపాయల వరకు  ప్రభుత్వ టెండర్లకు గ్లోబల్ టెండర్లు అవసరం లేదు.  వ్యాపారం మరియు వ్యవస్థీకృత కార్మికులకు ఉద్యోగుల భవిష్యనిధి మద్దతును మరో మూడు నెలలపాటు, జూన్, జులై, ఆగష్టు, 2020 నెలల వేతనాలకు కొనసాగింపు.    ఈ.పి.ఎఫ్.ఓ. పరిధిలోకి వచ్చే అన్ని సంస్థల యజమానులకు, ఉద్యోగులకు వచ్చే మూడు నెలలు ఈ.పి.ఎఫ్. చందా 12 శాతం నుండి 10 శాతానికి తగ్గింపు. ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ నిన్న 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేక ఆర్ధిక మరియు సమగ్ర...

దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం మే నెల 12వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగం పాఠం

దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం మే నెల 12వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగం పాఠం   నా దేశవాసులకు ఇవే అభినందనలు.  ప్రపంచ దేశాల లోని జన సముదాయంగత నాలుగు నెలల కు పైగా కరోనా వైరస్ తో పోరాడుతున్నది. ఈ కాలం లో ప్రపంచవ్యాప్తం గా 42 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా సంక్రమణ కు గురి అయ్యారు. 2.75 లక్షల మందికి పైగా ప్రజలు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. భారతదేశం లో కూడా, ప్రజలు వారి ప్రియతముల ను మరియు సన్నిహితుల ను కోల్పోయారు. అందరిక నేను హృద‌య‌పూర్వక ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. మిత్రులారా, ఒక వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసివేసింది. ప్రపంచం అంతటా కోట్ల మంది ప్రజలు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భూగోళం అంతటా, మనమందరమూ అమూల్యమైనటువంటి ప్రాణాల ను కాపాడుకోవడం కోసం ఒక సమరాన్ని సాగిస్తున్నాము.  ఈ తరహా సంకటాన్ని మనం ఎన్నడూ కని విని ఎరుగము.  ఈ గండం ఆలోచన కు అందనిదే కాక మానవాళి కి ఇటువంటి ఆపద ను ఇదివరకు ఎన్నడూ ఎదురయ్యిందేలేదు.  ఏమైనా, ఉద్వేగానికి లోనవడం, ఓడిపోవడం లేదా ముక్కలైపోవడం మానవ జాతి కి ఆమోదయోగ్యం కాదు. ఇటువంటి ఒక యుద్ధం లో మనం జాగరూకత త...

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌కు పిలుపునిచ్చిన ప్ర‌థాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ఆత్మ‌నిర్భ‌ర భార‌త్‌కు పిలుపునిచ్చిన ప్ర‌థాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేక ఆర్థిక ప్యాకేజ్ ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌మంత్రి 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల స‌మగ్ర ప్యాకేజ్‌ ఈ ప్యాకేజ్ మొత్తం, భార‌త‌దేశ జిడిపిలో ప‌దిశాతానికి స‌మానం స్వావ‌లంబ‌న భార‌త్ కు ప్రధాన‌మంత్రి పిలుపు. ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ కు సంబంధించి ఐదు స్తంభాల గూర్చి ప్ర‌క‌ట‌న‌ వివిధ రంగాల‌లో పెద్ద ఎత్తున సంస్క‌ర‌ణ‌లు దేశాన్ని స్వావలంబన వైపు ముందుకు తీసుకువెళ్ళ‌డానికి దోహదం చేస్తాయి: ప‌్ర‌ధాన‌మంత్రి మ‌న స్థానిక ఉత్ప‌త్తుల‌కు మ‌ద్ద‌తునిచ్చి , స్థానిక ఉత్ప‌త్తుల‌ను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలి : ప‌్ర‌ధాన‌మంత్రి నాడు పోస్టు చేయడమైనది: 12 MAY 2020 8:45PM by PIB Hyderabad   ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. కోవిడ్ మ‌హ‌మ్మారిపై పోరాటం సాగిస్తూ మ‌ర‌ణించిన వారిని స్మ‌రించుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి, కోవిడ్ -19 వ‌ల్ల ఉత్ప‌న్న‌మైన సంక్షోభం వంటిది మున్నెన్న‌డూ లేద‌ని అన్నారు. అయితే ఈ పోరాటంలో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డంతోపాటు, ముందుకు సాగిపోవ‌ల‌సి ఉంద‌న్నారు. స్వావంలంబ భార‌త్ ‌: కోవిడ్ కు ముంద...